ఐపీఎల్ 2023 29వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ పై సిఎస్కే విజయం సాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 135 పరుగుల లక్ష్యాన్ని అందించింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక చెన్నై ఓపెనర్స్ రుతురాజ్, కాన్వే అద్బుతమైన నాక్స్ ఆడారు. రుతురాజ్ 30 బాల్స్ లో 35 (రెండు 4) రన్స్ చేసి రన్ ఔట్ కాగా. కాన్వే 57 బాల్స్ లో 77 రన్స్ చేశాడు నాట్ ఔట్గా ఉన్నాడు. అంబటి రాయుడు 9 బాల్స్ 9 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అజింక్యా రహానే 10బాల్స్ 9 రన్స్ చేసి అవుటైయ్యాడు. ఇక చివరిగా వచ్చిన మోయిన్ అలీ 6 బాల్స్ లో 6 పరుగులు చేసి మ్యాచ్ ని ముగించేశాడు.
సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టులో అత్యధికంగా 34 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు జోడించాడు. వీరిద్దరూ మినహా ఆ జట్టులోని బ్యాట్స్మెన్ ఎవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. చెన్నై తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. దీంతో పాటు ఆకాశ్ సింగ్, మహిష్ తీక్షణ, మతిష పతిరనా 1-1 వికెట్లు తీశారు.