Thursday, April 25, 2024

22న రాష్ట్రంలో పర్యటించనున్న చేగువేరా కూతురు, మనుమరాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 22న తెలంగాణ రాష్ట్రంలో విప్లవయోధుడు చేగువేరా కూతురు, మనుమరాలు పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మధ్యాహ్నం జరిగే సభలో చేగువేరా కూతురు డా.అలైదా గువేరా, మనుమరాలు ప్రొ.ఎస్టీఫినా గువేరాలు పాల్గొననున్నట్లు పీవైఎల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కెఎస్‌.ప్రదీప్‌ తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు మద్దతుగా ప్రపంచశాంతి అంశంపై వారు ప్రసంగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు విద్యార్థి సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement