Sunday, May 5, 2024

చెక్ బౌన్స్ కేసు.. డైరెక్ట‌ర్ లింగుస్వామికి హైకోర్టులో ఊర‌ట‌

చెక్ బౌన్స్ కేసులో త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సినిమాను నిర్మించడం కోసం పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి 2014లో రూ. 1.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో రూ. 1.35 కోట్లకు చెక్ ఇవ్వగా… సదరు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ కేపిటల్స్ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో వీరికి హైకోర్టు ఊరటను కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement