Saturday, May 18, 2024

రేపు జంగారెడ్డిగూడెంకు చంద్ర‌బాబు

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. కల్తీసారా కారణంగా.. బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రాణాలు పోతున్నా స్పందించరా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా చర్యలు లేవని ధ్వజమెత్తారు. మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement