Sunday, May 5, 2024

అప్పుపై ఉన్న ద్యాస అభివృద్ధిపై లేదు: ఏపీ సర్కార్ పై పురంధేశ్వరి ఫైర్

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుపై ఉన్న ద్యాస అభివృద్ధిపై లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివద్ధి సాధ్యామా? అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ హయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని, ఏపీలోనూ బలపడాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి౦దని తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులలో కేంద్రం ఇచ్చే నిధులుతప్ప రాష్ట్ర వాటా సున్నా అని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement