Wednesday, May 15, 2024

ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మాటమార్చింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ సమావేశాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ… ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

కాగా ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది. తాజాగా ఈ పట్టిక వెలుగు చూసింది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఏపీ రాజధానిపై చాలాకాలంగా రగడ నడుస్తోంది. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జేఏసీతో పాటు పలు సంఘాలు చాలాకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: వైరల్ వీడియో: స్కిప్పింగ్ ఆడిన కేంద్ర మంత్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement