Sunday, April 28, 2024

కేంద్రం కీలక నిర్ణయం: ఈఎస్ఐ, పీఎఫ్ లబ్దిదారులకు

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్, ఈఎస్ఐ స్కీమ్ లబ్దిదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారు మరణిస్తే.. వారి సగటు రోజూ వారీ వేతనంలో 90 శాతానికి సమాన మైన మొత్తాన్ని పెన్షన్ కింద కుటుంబ సభ్యలులకు అందిస్తారు. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు లేదంటే అమ్మాయికి పెళ్లి అయ్యే వరకు లేదంటే భార్యకు జీవితాంతం ఈ పెన్షన్ లభిస్తుంది. ఇప్పుడు కోవిడ్ 19 వల్ల చనిపోయినా కూడా ఇదే ప్రయోజనం లభిస్తుంది. అయితే కోవిడ్ మరణానికి 3 నెలల ముందు అయినా ఈఎస్ఐ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఐపీ కచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి.

2020 మార్చి 24 నుంచి రెండేళ్ల వరకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి కూడా ఇలాంటి సదుపాయమే అందుబాటులో ఉంది. ఈడీఎల్ఐ స్కీమ్ అందించే ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కేంద్రం రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనీస ఇన్సూరెన్స్ రూ.2.5 లక్షలుగా నిర్ణయిస్తూ మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. వచ్చే మూడేళ్ల పాటు ఈ కనీస ఇన్సూరెన్స్ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement