Thursday, March 28, 2024

ఢిల్లీకి సీఎం జగన్.. పర్యటన వెనుక ఉన్న మతలబ్ ఏంటి?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన హస్తిన వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అదేవిధంగా విభజన హామీలు, వాక్సినేషన్‌ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ సారి సీఎం ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. సీఎం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం. అమిత్ షాతో జరిగే సమావేశంలో ప్రధానంగా ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చించనున్నారు.

మరోవైపు ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసారు. అంతేకాదు వ్యాక్సిన్ల అంశంపై జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు.  దీని పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ అంశం పైన అమిత్ షా భేటీలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇక, ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement