Sunday, May 19, 2024

అల్‌ఖైదా హెచ్చ‌రిక‌ల‌తో కేంద్రం అలర్ట్​.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిఘా ప‌టిష్టం

ముంబయి, యూపీ, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉగ్రదాడులు చేస్తామని ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు ఆయా ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి. విమానాశ్రయాలు, మెట్రో, రైల్వేస్టేషన్లు, మార్కెట్లలో గస్తీని పెంచాయి. అనుమానాస్పదంగా ఎలాంటి చర్యలు గుర్తించినా.. వెంటనే సమాచారం అందించాలని అధికారులు, సిబ్బందికి సూచించాయి. బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీనికి నిరసనగా భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అల్‌ఖైదా లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

https://twitter.com/retardwoke/status/1534210719700643840
Advertisement

తాజా వార్తలు

Advertisement