Sunday, May 5, 2024

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు కరీంనగర్ లో సంబరాలు నిర్వహించుకున్నారు. టిఎస్ఆర్టిసి ని ప్రభుత్వంలో విలీనం విలీనం చేయడంతో కార్మికుల సంబరాలు అంబరాన్ని అంటాయి.. సోమవారం రాత్రి కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వన్ డిపో ముందు కార్మికులు సీట్లు పంచుకొని పటాకులు కాల్చి సంబరాలు జరిపారు. ఆర్టీసీ బస్సు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ల భారీ కటౌట్లు కట్టి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆర్టీసీ కార్మిక నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ణయం తీసుకోవడం హర్షణనియమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిసి కార్మిక లోకమంతా మద్దతుగా ఉండి మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి కండక్టర్, ప్రతి డ్రైవర్ ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కు ఎప్పుడు అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement