Thursday, May 2, 2024

RRR పిటిషన్ కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్.. జగన్ బెయిల్ రద్దుపై విచారణ!

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ​ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సాక్షులను ముఖ్యమంత్రి జగన్ ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌ లో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. కోర్టు విధించిన బెయిల్ షరతులు జగన్ ఉల్లంఘించారని.. రద్దు చేయాలని ఆయన పిటిషన్​లో కోరారు. గతంలో సీబీఐ కోర్టులో వాదనలు జరిగినప్పుడు.. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదించారు.

కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌ షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. రఘురామ జగన్‌ పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారణ జరపాలా లేదా అన్న అంశంపై ఈ రోజు తీర్పు ఇచ్చింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement