వరంగల్ – వరంగల్ పట్టణానికి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టి ఆర్ ఎస్ నేతలు ఒక్కసారి బస్టాండ్ కు వెళ్లి చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఆయన నేడు పలు డివిజన్ లలో బిజెపి అభ్యర్ధుల తరుపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని బస్టాండ్ కూలిపోయే స్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో ఉందని అన్నారు… కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి ఈ ఒక్క రైల్వే స్టేషన్ చాలని అన్నారు… వరంగల్ కార్పొరేషన్ లో బి జెపి కి ప్రాతినిధ్యం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయిలు వరంగల్ అభివృద్ధికి ఇచ్చిందని అన్నారు.. వడ్డించేవాడికి అధికారం ఇస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు.. రాబోయే రోజుల్లో ఓరుగల్లులో కరోనా కంటే ఘోరమైన పరిస్థితి తలలు నరికే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ, తలలు నరికే పార్టీ కావాలా ..కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే అభివృద్ధి చేసే పార్టీ కావాలా ఓటర్లే ఆలోచించాలని అన్నారు..హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటింటికి రూ 10 వేలు ఇచ్చిన టిఆర్ ఎస్ వరంగల్ లో వరదలు వస్తే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.. ఈ ఎన్నికలలో గెలుపు కోసం అధికార పార్టీ కోట్లాది రూపాయిలను దించాయని అంటూ ఆ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని బిజెపికి ఓటు వేయాలని కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement