Monday, May 6, 2024

లక్కీ ఫెలోస్​: 100 మంది ఉద్యోగులకు కార్లు బహుమతి.. మారుతి సుజకీ నిర్ణయం

తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు అద్భుతమైన బహుమతులు అందజేసింది. ఏళ్ల తరబడి కంపెనీ వెంటే ఉంటూ.. అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన 100 మందిని ఎంపిక చేసి వారికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తమిళనాడుకు చెందిన ఐడియాస్‌2ఐటీ కంపెనీ చెన్నై కేంద్రంగా పని చేస్తుంది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పదేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో కొంత మంది ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితంగా కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. నష్టంలో ఉన్నా.. లాభంలో ఉన్నా.. ఉద్యోగులతో ఒకేలా ట్రీట్‌ చేసింది. అందరికీ మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లను అందజేసింది. వారి కుటుంబ సభ్యులను పిలిచి ఓ వేడుకగా ఈ కార్లను అప్పగించింది. తమిళనాడులో ఈ తరహా బహుమతులందించే సంస్థలు పెరుగుతున్నాయి. గతంలోనూ ఓ కంపెనీ సంస్థలోని ఎగ్జిక్యూటివ్‌ స్థాయి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు విలువ చేసే ఐదు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement