Thursday, May 16, 2024

Breaking: స‌వ‌తిగా వ‌చ్చిన చెల్లె.. పోరు త‌ట్టుకోలేక‌ విషం పెట్టి చంపిన అక్క

నంద్యాల : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం జ‌రిగింది. త‌న సొంత చెల్లెలికే విషం పెట్టి చంపేసింది ఓ సిస్ట‌ర్‌. ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లా కొత్తపల్లి (మం) ఎదురుపాడు గ్రామంలో జ‌రిగింది. సొంత సోదరి అయిన తిరుమలేశ్వరికి అన్నంలో ఎలుకల మందు పెట్టి చంపిన అక్క దుర్మార్గం ఘటన వెలుగులోకి వచ్చింది. డెడ్ బాడీని చూస్తే చాలాకాలం క్రితమే చంపేసిన‌ట్టు తెలుస్తోంది.

అక్క జానకమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె భర్త జనార్ధన్ చెల్లెల్ని కూడా 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది ఓర్చుకోలేని అక్క తన సొంత చెల్లెలైన తిరుమలేశ్వరికి అన్నంలో ఎలుకల మందు కలిపి చంపేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో.. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement