Sunday, April 28, 2024

ఏపీలో కరోనా పంజా.. 1100 దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,184 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 66, కర్నూలు జిల్లాలో 64, కడప జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 45, తూ.గో. జిల్లాలో 26, విజయనగరం జిల్లాలో 19, ప.గో. జిల్లాలో 11 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 456 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,01,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,87,434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 7,338గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,217గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement