Tuesday, March 26, 2024

టీ పొడి అనుకుని..విషపు గుళికలు వాడింది – అంతే !!

చాలామంది టీ తాగకుండా ఉండలేరు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సమయంలో టీ తాగుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో తాగుతారు… మరికొంతమంది బయటికి వచ్చి మరీ తాగుతారు. తాజాగా ఓ మహిళ టీ చేయాలని తొందరలో టీ పొడి అనుకొని విషపు గుళికలు కలిపింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

వివరాల్లోకి వెళితే జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం రామచంద్రపురంలో అంజమ్మ అనే మహిళ ఉదయం ఇంట్లో టీ పెట్టాలని వంటగదిలోకి వెళ్ళింది.తొందరపడుతూ టీ పొడి అనుకుని అందులో విషపు గుళికలు కలిపింది. అది తెలియక కుటుంబంలోని అందరూ కూడా తాగేశారు. అయితే అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. వారికి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement