Friday, May 10, 2024

శాంతించిన గోదావ‌రి.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద 47.9 అడుగులకు చేరిన నీటిమట్టం

వారం కింద‌ట కురిసిన వ‌ర్షాలకు గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చిన విష‌యం తెలిసిందే.. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా భ‌ద్రాచ‌లం వ‌ద్ద 70 అడుగుల నీటిమ‌ట్టానికి చేరుకుని ప్ర‌వ‌హించింది. అయితే ఎగువ‌న వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో గోదావ‌రి శాంతించింది. ప్ర‌స్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది. వరద ఉధృతి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లు మూసివేశారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement