Monday, May 6, 2024

British Prime Minister: వివాదంలో బ్రిటన్ ప్రధాని..దుమారాన్ని రేపుతున్న క‌రోనా నాటి వాఖ్య‌లు…

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వివాదంలో ప‌డ్డారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో రెండవసారి లాక్‌డౌన్ విధించడం కంటే కొంతమంది చనిపోవడానికి అనుమతించడమే మంచిదని సునాక్ వ్యాఖ్యానించారనే వార్తలు బ్రిటన్‌లో దుమారం రేపుతున్నాయి.

నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉండగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై జరిగిన సమావేశంలో సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ పేర్కొన్నారు. ఈ మేరకు డైరీ ఎంట్రీని విచారణకు సమర్పించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement