Sunday, May 5, 2024

President Murmu : పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కట్టుదిట్టమైన భద్రతా

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ‌ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయం చేరుకుంటారు.

అనంత‌రం పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం పాల్గొన‌నున్నారు. 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement