Monday, April 29, 2024

Breaking : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్య్సకారులకి హెచ్చరిక

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతాలను ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా కదిలి నేటి సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందనుంది. డిసెంబరు 8 ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలోకి రానుంది. దీని ప్రభావంతో డిసెంబరు 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

అదే సమయంలో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. డిసెంబరు 10న తుపాను తీవ్రత కాస్త తగ్గుతుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వివరించింది ..నేటి సాయంత్రం నుంచి తీర ప్రాంత జిల్లాల్లో గాలుల తీవ్రత పెరగనుందని, డిసెంబరు 8 సాయంత్రం నుంచి డిసెంబరు 9వ తేదీ ఉదయం వరకు 100 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఆపై క్రమంగా గాలుల వేగం తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. నేటి నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 10వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement