Friday, May 3, 2024

Breaking : జిల్లా కోర్టు భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించిన ఎన్వీర‌మ‌ణ‌-పాల్గొన్న సీఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ‌లో జిల్లా కోర్టు భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించారు సీజేఐ ఎన్వీర‌మ‌ణ‌.ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. కాగా ఒకే భ‌వ‌నంలో 31కోర్టులు ఉంటాయి.2013 మే 13న ఈ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. వంద‌కోట్ల‌తో ఎనిమిది అంత‌స్తుల్లో భ‌వనాన్ని నిర్మించ‌నున్నారు. తాను శంకుస్థాప‌న చేసిన భ‌వ‌నాన్ని ప‌దేళ్ల త‌ర్వాత ప్రారంభోత్స‌వం చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు ఎన్వీ ర‌మ‌ణ‌. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..ఈ భ‌వనం ఆల‌స్యానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌న్నారు.సిటీ సివిల్ కోర్టు ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు ఎన్వీర‌మ‌ణ‌. రూ.92.60కోట్ల‌తో 3.70ఎక‌రాల్లో కోర్టు నిర్మాణం జ‌రుగనుంది. 8వ అంత‌స్తులో 200మంది సామ‌ర్థ్యంతో ఆడిటోరియం..మీటింగ్ హాల్..ఉండ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement