Thursday, May 2, 2024

Breaking : కారు బోల్తా-ముగ్గురు మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు కారు బోల్తా ప‌డింది.ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న అన్నమయ్య జిల్లా కేశాపురం వద్ద చోటు చేసుకుంది. చిన్నమండె మండలానికి చెందిన సోదరులు గఫర్‌ఖాన్‌, ముక్తీయార్‌తో పాటు మరొకరు కారులో మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కేశాపురం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది . అనంతరం కారు పంట పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది.ఘటనా స్థలంలోనే గఫర్‌ఖాన్‌, ముక్తీయార్‌లు చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement