Monday, April 29, 2024

క‌రోనా నుంచి కోలుకున్న రాహుల్ ద్ర‌విడ్-జ‌ట్టుకు సేవ‌లందించేందుకు సిద్దం

క‌రోనా నుంచి కోలుకున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ద్ర‌విడ్‌… శ‌నివారం రాత్రే దుబాయి చేరుకున్నాడు. జ‌ట్టు స‌భ్యుల‌తో అత‌డు క‌లిసిపోయాడు. పాక్‌తో కీల‌క మ్యాచ్‌కు ఓ రోజు ముందుగానే అత‌డు జ‌ట్టుకు అందుబాటులోకి రావ‌డం శుభ ప‌రిణామంగానే భావిస్తున్నారు. క‌రోనా బారిన ప‌డిన ద్ర‌విడ్ బీసీసీఐ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకున్నారు. ఈ చికిత్స‌తో త్వ‌ర‌గానే క‌రోనా నుంచి కోలుకున్న ద్ర‌విడ్‌… తిరిగి జ‌ట్టుకు త‌న సేవ‌లు అందించేందుకు రంగంలోకి దిగ‌డం ప‌ట్ల క్రికెట్ ఫ్యాన్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement