బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఖారారైంది. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని, జులై 10న రంగం (భవిష్య వాణి) ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల విశిష్టతను మరింత పెంచింది సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement