Thursday, May 2, 2024

Bomb blast case – తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు

తమిళనాడులో ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడువ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు శనివారం తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, కొయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement