Friday, May 3, 2024

Kavali – రెండు లారీలు, బస్సు ఢీ – ఏడుగురు దుర్మరణం

కావలిలో టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి..గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాధితులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇంకా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement