Sunday, May 5, 2024

తెలంగాణను హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!

తెలంగాణలో కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ గుబులు రేపుతోంది. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపుతోంది. బీర్కూర్ మండలం బరం గెడిగిలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా తగ్గాక బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లోనూ బ్లాక్ పంగస్ ఉగ్రరూపం దాల్చుతోంది. బ్లాక్ పంగస్ కేసులు రోజురోజుకు భయటపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో పలువురు బ్లాక్ పంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది. అలాగే పలువురు బాధితులు కంటి చూపు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితులను చికిత్స కొసం హైదారాబాద్ లోని ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఇదిఇలా ఉంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 16 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 615 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement