Friday, April 26, 2024

చెట్టు పైనే క‌రోనా ఇల్లు…

నల్గొండ : కరోనా విజృభిస్తుండగా ..పల్లె వాసులను కోవిడ్‌ వదలడం లేదు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండ లం, కొత్త నందికొండ గ్రామం లో కరోనా కేసులు పెరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో గ్రామా నికి చెందిన రామావత్‌ శివకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో ఇంట్లోవారికి తనవల్ల కరోనా వస్తుందనే భయంతో ఇంటి ముందున్న చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నాడు. కుటుంబ సభ్యులు నలుగురు ఒకే ఇంట్లోనే ఉంటుండగా శివ చెట్టు పైన మంచం ఏర్పాటు చేసుకుని అక్కడే తొమ్మిది రోజులుగా నివాసం ఉంటున్నాడు. తాగునీరు, భోజనం కింది నుంచి పంపిస్తున్నారు. ఇంట్లో ఒకటే రూమ్‌ కావడంతో వసతి లేక ఇలా ఉంటున్నట్టు శివ చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement