Monday, April 29, 2024

జనసేనకు చెప్పే చేస్తున్నాం… పురంధరేశ్వరి

తిరుపతి ఉప ఎన్నికలలో విజయం మాదేనన్నారు బీజేపీ మహిళా నేత పురంధరేశ్వరి. స్ధానిక సంస్ధల ఎన్నికలలో వైసీపీ గెలుపు న్యాయ పరంగా గెలిచిన గెలుపు కాదని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు తమ తీర్పును కరెక్ట్ గా వ్యక్తపరుస్తారని… తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం బిజెపి చేపట్టిందేన్నారు. స్మార్ట్ సీటి,నడికుడి రైల్వే లైన్ ,ఐఐటి ,ఐసర్,అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వరకు అన్ని బిజెపి ఇచ్చిందేన్నారు. ఏపీలో అనేక ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని పురంధరేశ్వరి విమర్శించారు.

ఫేక్ ఐడి కార్డ్స్ తో దోంగ ఓట్లును ఎన్నికలలో వేశారని పురంధరేశ్వరి ఆరోపించారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్‌ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జనసేన, బిజెపి కలసి ఎన్నికల్లో విజయం సాదిస్తామన్నారు. బిజెపి ఏ చిన్న పనిచేసినా అ సమాచారాన్ని జనసేనకు చేరవేస్తున్నామని పురంధరేశ్వరి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement