Saturday, April 27, 2024

టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది బీజేపీనే: మురళీధర్ రావు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదురించేది బీజేపీ పార్టీయేని బీజేపీ సీనియర్ నేత పి.మురళిధర్ రావు అన్నారు. ఏ పార్టీకి అమ్ముకు పోకుండా కోవర్టులు లేకుండా టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే సత్తా ఒక బీజేపీ పార్టీకే ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ పార్టీ అంకితమై పనిచేస్తుందని…తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ తో బీజేపీకీ పొత్తు లేదన్నారు. ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారంటే… అది ప్రధాని, ముఖ్యమంత్రి కలయికనే కానీ, పార్టీల పొత్తు కాదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు వేరు… దేశ విధానాలు వేరని తెలిపారు. నిజాం వారసత్వ రాజకీయ పార్టీలతో లాలూచీపడి… సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపని పార్టీతో బీజేపీ పొత్తు ఉండబోదన్నారు. ఇక బీజేపీ ఇతర పార్టీల కంటే భిన్నమైనదని ఏ పార్టీ కూడా బిజెపికి సమానం కాదన్నారు. ప్రపంచ దేశాలలో.. అమెరికా, రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు.

ఇది కూడా చదవండి :206 కోట్లతో టికెట్ కొన్నాడు..ఇప్పుడు బీజీగా ఉన్నా రాలేనంటున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement