Monday, May 6, 2024

దేశభక్తికి నిదర్శనం కమలం.. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టం : బాల్ రాజ్ నూనె

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్ ను విశ్వ గురువుగా చేయడమే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్ రాజ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశభక్తికి అంకితమై పని చేస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంలో ముందుకు సాగుతున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త కృషి ఫలితంగానే పార్టీ ఈ రోజు ఈ స్థితిలో ఉందని తెలిపారు. బిజెపి పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ రుణపడి ఉంటుందని చెప్పారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ను సాధించేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు వారసత్వ రాజకీయాలతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నట్లు విమర్శించారు.

ప్రజల తరుపున పోరాడి.. వారికి అండగా నిలిచి.. వారి మనస్సులను గెలిచిన పార్టీ బిజెపి మాత్రమేనని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో నేడు ప్రపంచ దేశాలతో భారత్ భయం, ఒత్తిడి లేకుండా ఎవరికి కొమ్ము కాయకుండా తన ఉద్దేశాలను దైర్యంగా నిలుపుతుందని బాల్ రాజ్ చెప్పారు. మానత్వానికి మారు పేరుగా భారత్ నిలుస్తునడానికి వివిధ దేశాల అధిపతుల మాటలే నిదర్శనమన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజల వద్దకు సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో ప్రతి ఒక్కరు దేశం అభివృద్ధి చెందుతోందని గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement