Monday, April 29, 2024

తెలంగాణ‌ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది : మనీష్ సిసోడియా

తెలంగాణలో టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండడ్ గా దొరికింద‌ని, బీజేపీ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం సిగ్గుచేట‌ని ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంద‌న్నారు. మీరు మా పార్టీలో చేరితే ఈడీ, సీబీఐలు మీ జోలికి రావంటు బీజేపీ చెబుతోంద‌న్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంద‌ని, దేశంలో పెరిగిన ధ‌ర‌ల‌తో పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే బీజేపీకి ప‌ట్ట‌దా అన్నారు. ఇంత డబ్బు బీజేపీకీ ఎక్కడి నుంచి వస్తుంద‌న్నారు. ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశార‌ని, ఈ కొనుగోలు వ్యవహారం వెనకాల అమిత్ షా ఉండ‌టం సిగ్గుచేటు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement