Saturday, April 27, 2024

‘భార‌త్ ప‌ర్వ్’ లో మినీ ఇండియా – వీడియోతో..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర ఉత్సవాల పరేడ్.. భారతదేశ శౌర్య, సాహసాలకు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వించేలా జరిగిన ఈ ఉత్సవాలల్లో.. ప్రధానిమోడీ సంకల్పించిన ఆత్మనిర్భర భారత్, నారీశక్తి సామర్థ్యం చాలా చక్కగా ప్రదర్శితమైందని ఆయన అన్నారు. ఎర్రకోట వద్ద ‘భారత్ పర్వ్’ కార్యక్రమాన్ని ఇటీవ‌ల‌ ఢంకా బజాయించి ప్రారంభించిన కిషన్ రెడ్డి, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ భారత్ పర్వ్ కార్యక్రమం ‘మినీ ఇండియా’ను తలపిస్తోందన్నారు.

వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను, కళలను, వివిధ రకాల వంటకాలను చూస్తుంటే.. యావద్భారతాన్ని ఒకేచోట చూసినట్లు అనిపిస్తోందన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా భారత్ పర్వ్ కార్యక్రమం జరుపుకోలేకపోయామన్న కిషన్ రెడ్డి.. ఈసారి ఈ ఉత్సవాలను జరుపుకుంటుండటం, ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా భాగస్వాములు అవుతుండటం శుభపరిణామమన్నారు. భారత పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించిన శకటాలన్నీ ఈ భారత్ పర్వ్ లో ప్రదర్శనకు పెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రదర్శనను తిలకించేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ భార‌త్ ప‌ర్వ్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ స్వ‌రూప ఇటీవల స్వ‌యంగా వీక్షించి , అక్క‌డి విశేషాల‌ను వీడియో రూపంలో మీకు అందిస్తున్నారు.. ఆ విశేషాల‌ను మీ వీడియోలో చూసేయండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement