Tuesday, May 14, 2024

Bharata Ratna – బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న పురస్కారం

బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. 1977-79 మధ్య కాలంలో బీహార్ సీఎంగా పని చేశారు. ఓబీసీ నాయకుడిగా ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉండేది. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న అవార్డు ప్రకటించారు.

సోషలిస్టు పార్టీ, భారతీయ క్రాంతి దళ్ పార్టీల తరఫున 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ బీహార్ సీఎంగా పని చేశారు. తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకూ సీఎంగా ఉన్నారు.బీహార్ లోని సమస్తిపూర్ లో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పని చేసి జైలు పాలయ్యారు కూడా. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1924 లో జన్మించిన అయన 1998 లో కన్నుమూశారు. భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను కర్పూరి మరణించిన 26 సంవత్సరాల అనంతరం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement