Sunday, May 5, 2024

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట రాముని పట్లవద్ద పెద్దకోడూర్ కి చెందిన ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ విద్యార్థుల‌కు ప్రమాదంలో స్వల్ప గాయాలు కాగ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు తక్షణమే సిద్దిపేట వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, సిటీ స్కాన్ , ఎక్స్ రే తీసి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని నేను ఉన్నాను.. అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement