Friday, April 26, 2024

కొండగట్టుకు బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బయలుదేరారు. బుధవారం ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా కొండగట్టుకు వస్తున్నారు. జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎలిఫర్డ్ నుండి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండగట్టు మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మానంతో పాటు ప్రత్యేక వసతుల కోసం ఈనెల 7వ తేదీన 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం విధితమే. సీఎం కేసీఆర్ వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement