Thursday, May 2, 2024

మ‌రోసారి పేరెంట్స్ అవుతున్నాం – యాంక‌ర్ లాస్య‌

ఇప్ప‌టికే యాంక‌ర్..న‌టి లాస్య‌..మంజునాథ్ దంప‌తుల‌కి జున్ను అనే కుమారుడు ఉన్నాడు.కాగా వీరు మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నారు.. లాస్య సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… తాము మరోసారి పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను ప్రెగ్నెంట్ అని ఆమె చెప్పింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. మరోవైపు, లాస్య చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాస్య దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యాంక‌ర్ ర‌వితో క‌లిసి లాస్య ప‌లు షోల‌లో మెరిసింది. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య‌..త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement