Monday, May 6, 2024

రాష్ట్రంలో బీసీలు కేంద్రంలో ఓసీలు, తెలంగాణలో ఇలా మొత్తం 40 కులాలు.. అందరికీ న్యాయం చేయండి : కే.లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాల జాబితాలో ఉన్న దాదాపు 40 కులాలకు జాతీయ ఓబీసీ జాబితాలో చోటు కల్పించకపోవడంతో జాతీయస్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నేత జే. సంగప్ప, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు ఉన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన డా. లక్ష్మణ్.. జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్న వర్గాలకు కూడా ఫలాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న 40 కులాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు, ఫలాలు అందించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, ఇదే మాదిరిగా వీరశైవ లింగాయత్ సహా ఓబీసీ జాబితాలో చోటులేని మిగతా బీసీ కులాలకు న్యాయం జరిగేలా తాను ప్రత్యేక దృష్టి పెడతానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement