Sunday, May 19, 2024

Breaking: కేంద్ర కేబినెట్ లోకి బండి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ?

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుత కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డికి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి. అలాగే అటు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కూడా పార్టీలో కీలక పదవిని కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. వారంలోగా ఈ మార్పులు జరగనున్నాయని ఢిల్లీ నుంచి బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఒక కీలక పదవి అప్పగించనున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement