Thursday, May 23, 2024

బాల‌కృష్ణ చొర‌వ‌తో – ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య ర‌థం

తన నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే వినూత్న కార్యక్రమానికి నాంది పలకనున్నారు న‌టుడు బాల‌కృష్ణ‌. 200ల‌కి పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతాశిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లోనే ఏర్పాటు చేసే విధంగా రూ.40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం సిద్ధం చేశారు. ఆ రథం హిందూపురం చేరుకుంది. దీనిని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ వాహనంలో ఒక వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్‌ ఉంటాయి. సాధారణ వ్యాధులకు అక్కడే వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఇతర వైద్య సేవలు అవసరమున్న వారిని పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేస్తారు. ఈ వాహనం రోజూ ఒక గ్రామానికి వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌కి సేవ‌లు అందించ‌నుంద‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement