Saturday, May 4, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మంజార్‌సంబా-పటోడా హైవై పై కారు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన‌డంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. జివాచివాడికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఓ కారులో పుణేలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారని, ఈ క్రమంలో వారి కారును ఓ టెంపో ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. రెండు వాహనాలను క్రేన్‌ సహాయంతో వేరుచేశామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement