Monday, April 29, 2024

Asia cup | నేపాల్-భార‌త్ మ్యాచ్ కు బుమ్రా దూరం..

ఆసియాకప్ 2023 లో భాగంగా రేపు (సెప్టెంబర్ 4న) భారత్, నేపాల్ మ‌ద్య ఆసక్తికర పోరు జరగనుంది. సూపర్ 4కు ముందు ఇది టీమిండియాకు వార్మప్ మ్యాచ్ లాంటిది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత అభిమానులకు చిన్నపాటి షాకిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది.

ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా.. ఉన్నపళంగా ఇండియాకు బయలు దేరాడు. అయితే దీనిపై బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. బుమ్రా మాత్రం వ్యక్తిగత కారణాలతో శ్రీలంక నుంచి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. దీంతో నేపాల్ తో జరిగే మ్యాచ్ కు బుమ్రా దూరం కానున్నాడు. సూపర్ 4 మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement