Tuesday, April 30, 2024

అచ్యుతాపురం వద్ద రూ.1,750 కోట్లతో ఏటీసీ టైర్స్‌.. ఆగస్ట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఈ ఏడాది ఆగష్టు నెలలో నూతన ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు కల్సి తమ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఏటీసీ ది యోకోహామా రబ్బర్‌ కో. లిమిటెడ్‌, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ . ఏటీ-సీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్‌ హైవే టైర్ల (ఓహెచ్‌టీ ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీ జీ ప్రముఖ సంస్థగా పేరుంది. . 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు విస్తరించాయి. ఏటీసీ భారతదేశంలో ఇప్పటి వరకు రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్‌ (గుజరాత్‌). ఏపీలో అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో కొత్తగా మూడో ప్లాంట్‌ను నూతనంగా ఏర్పాటు చేసింది.

ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ కాగా 2 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అచ్యుతాపురం ప్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్‌సీ సెగ్మెంట్‌), పెద్ద బయాస్‌ టైర్లు (అగ్రి మరియు కాన్స్‌), రేడియల్‌ టైర్లు (అగ్రి), రేడియల్‌ (ఓటీఆర్‌), బయాస్‌ టైర్‌, ఓటీఆర్‌ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్‌ టైర్లు ఉత్పత్తి కానున్నాయి. ఈ సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ ప్రహ్లద్‌ రెడ్డి, అంబరీష్‌ ఆర్‌ షిండే, పీఆర్‌ హెడ్‌ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన సీఎంవో అధికారుల పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement