Tuesday, April 16, 2024

క్రీడాకారులు శ్రీకాంత్‌, జాఫ్రిన్‌కు సీఎం జగన్‌ అభినందనలు..

అమరావతి, ఆంధ్రప్రభ : భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌, ఇండియన్‌ డెఫిలింపియన్ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్‌ అభినందించారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో భారత స్టార్‌ షట్లర్‌. కిడాంబి శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. అలాగే బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై వీరుభయుల క్రీడా ప్రతిభను సీఎం జగన్‌ ప్రశంసించారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

అదేవిధముగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం అధికారులకు చెప్పారు. ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, సీఎం, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున సీఎం జగన్‌కు ఏపీబీఏ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ బ్యాడ్మింటన్‌ కిట్‌ అందజేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement