Tuesday, May 7, 2024

Asian Games – బ్యాడ్మింట‌న్ పురుషుల టీమ్ విభాగంలో భార‌త్ కు వెండి ప‌త‌కం …

అసియా గేమ్స్ లో తొలిసారిగా భార‌త్ పురుషుల జ‌ట్టు తొలిసారిగా వెండి ప‌త‌కం సాధించింది.. బ‌ల‌మైన చైనా తో జ‌రిగిన పోరులో టీమ్ ఇండియా 2-3 తో ఓట‌మి పాలై సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకుంది.. సింగిల్స్ విభాగంలో ల‌క్ష్య సేన్, డ‌బుల్ విభాగంలో చిరాగ్ , సాత్విక్ జోడీ చైనా క్రీడాకారుల‌పై సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసి భార‌త్ ను 2 – 0 ఆధీక్యం లో నిలిపారు..


ఆ త‌ర్వాత జ‌రిగిన సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ , మిథున్ మంజునాథ్ , డ‌బుల్స్ విభాగంలో ధృవ్ , ప్ర‌తీక్ లు ఓట‌మి పాలు కావ‌డంతో చైనా 3.-2 తో గెలిచి బంగారు ప‌త‌కాన్ని సాధించింది.. టీమ్ ఇండియాకు వెండి ప‌త‌కం ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement