Wednesday, May 15, 2024

టాంజానియాలో ఆర్మీ చీఫ్‌ పర్యటన.. రక్షణ సంబంధాల బలోపేతంపై దృష్టి

భారత్‌, టాంజానియా దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేసే నిమిత్తం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే టాంజానియాలో సోమవారం అధికారిక పర్యటన చేపట్టారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా టాంజానియా ప్రెసిడెంట్‌ సమీయా సులుహు హస్సన్‌, రక్షణ మంత్రి స్టెర్గోమెనా లారెన్స్‌ టాక్స్‌, డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ జనరల్‌ జాకోబ్‌ జాన్‌ కుండాతో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విడివిడిగా భేటీ అవుతారని పేర్కొంది. తన పర్యటనలో భాగంగా నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement