Tuesday, May 7, 2024

ఆపిల్‌ను వెనక్కి నెట్టిన ఆరామ్‌కో.. చమురు ధరలు పెరగడంతో కలిసొచ్చింది

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఇప్పటివరకు వెలిగిపోతున్న ఆపిల్‌ ఇన్‌కార్పొరేషన్‌ను సౌదీకి చెందిన ఆరామ్‌కో వెనక్కినెట్టేసింది. చమురు ధరలు పెరగడం ఆరామ్‌కోకు బాగా కలిసి వచ్చింది. అదే సమ యంలో టెక్‌ స్టాక్స్‌ వరసగా పతనం అవుతుం డడంతో ఆపిల్‌ సంపద కరిగిపోయింది. బుధవారం నాడు ట్రేడింగ్‌లో ఆరామ్‌కో వాటాల విలువ రికార్డు స్థాయికి పెరిగింది. దీంతో ఆరామ్‌కో విలువ 2.43 ట్రిలియన్‌ల డాలర్లకు చేరుకున్నది. దీంతో 2020 తరువాత మరోసారి ఇది ఆపిల్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

ఇదే సమయంలో ఆపిల్‌ షేర్‌ విలువ 5.2 శాతం పడిపోయి 146.50 డాలర్లకు దిగజారింది. దీంతో ఆపిల్‌ మొత్తం విలువ 2.37 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది ఆరంభంలో ఆపిల్‌ మార్కెట్‌ 3 ట్రిలియన్‌ డాలర్లకు పైచిలుకు ఉండేది. ఇది ఆనాటి ఆరామ్‌కో మార్కెట్‌ విలువ కన్నా ఒక ట్రిలియన్‌ డాలర్లు ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో ఆరామ్‌కో లాభాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement