Wednesday, May 8, 2024

ఏపీలో ఎన్నికల షెడ్యూల్.. ఏం ఎన్నికలంటే

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం మిగిలిన సర్పంచ్& వార్డు మెంబర్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈనెల 19న పోలింగ్ ను నిర్వహించటంతో పాటుగా అదే రోజున కౌంటింగ్ నిర్వహించి, లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలు కూడ వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని 1.033 గ్రామ పంచాయతీల్లోని 66 సర్పంచ్లు, 1,064 వార్డు సభ్యుల సాధారణ ఖాళీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నిక అయిన ప్రజా ప్రతినిధులు మరణించటం, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేయటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఆగస్టు ఎనిమిది న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆమె తెలిపారు.

అలాగే 8వ తేదీ నుంచి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఆగస్టు 10 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఆగస్టు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నిర్వహింస్తారు. నామినేషన్ల తిరస్కరణ, వ్యతిరేకంగా అప్పీళ్లను ఆగస్టు 12న అప్పీలేట్ అథారిటీ ముందు దాఖలు చేయవచ్చు. అప్పీళ్లను పరిష్కరించేందుకు ఆగస్టు 13న అప్పీలేట్ అథారిటీ నిర్ణయం తీసుకుంటారు.

- Advertisement -

నామినేషన్లు ఆగస్ట్ 14 మద్యాహ్నం మూడు గంటల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు . పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ను అధికారులు ప్రకటిస్తారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం ఎడు గంటల నుండి మధ్యాహ్నం ఓంటి గంట వరకు, పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి, పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement