Monday, May 13, 2024

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 909 కేసులు నమోదవగా ఇవాళ మరోసారి వెయ్యి పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా…11 మంది మృతి చెందారు. ఇదే స‌మ‌యంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669 కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341 గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతి చెందిన‌ వారి సంఖ్య 13,671 కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 19,65,657 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.

ఇది కూడా చదవండి: రాజభవనంలో రాక్షసానందం పొందుతున్న తాలిబన్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement