Sunday, April 28, 2024

నవంబరు 20 నుంచి తిరుచానూరు పద్మావతి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు..

నవంబరు 20 నుంచి తిరుచానూరు పద్మావతి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 8 రోజులపాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం నవంబరు 19న అంకురార్పణ చేపడతారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 15 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రెండేండ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవల వివరాలు :
20-11-2022 (ఆదివారం) ధ్వజారోహణం, చిన్నశేషవాహనం
21-11-2022 (సోమవారం) పెద్దశేషవాహనం, హంసవాహనం
22-11-2022 (మంగళవారం) ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం
23 -11-2022 (బుధవారం) కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం
24 -11-2022 (గురువారం) పల్లకీ ఉత్సవం, గజవాహనం
25-11-2022 (శుక్రవారం) సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం
26-11-2022 (శనివారం) సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
27-11-2022 (ఆదివారం) రథోత్సవం, అశ్వ వాహనం
28-11-2022 (సోమవారం) పంచమీతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలను చేపడుతారని ఆలయ పూజారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement